షార్జాలో నేరస్తులు కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చు
- February 17, 2018
షార్జా : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం...కుటుంబాలను కలపడం ఎంతో సంతోషం ఇస్తుందని పలువురు ఖైదీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేశంతో అకృత్యాలకు పాల్పడి ఆ తర్వాత పశ్చాత్తపడి కుటుంబసభ్యులతో మాట్లాడాలని ఉన్నా అవకాశం లేక చీకటి గదుల్లో కుమిలిపోయేవారు. ఇటువంటివారిని సానుభూతితో అర్ధం చేసుకొన్న షార్జా ప్రభుత్వం పలు నేరాలు చేసి జైలులో ఉండే ఖైదీలు వారి పిల్లలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖైదీల పిల్లలు, వారి ఆత్మీయులతో మాత్రమే మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సేవలను షార్జా సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఈ సేవల వల్ల పిల్లలు జైలు పరిసరాలను కూడా చూసే అవకాశం ఉండదని, కుటుంబ విలువలు మరింత పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. షార్జాలోని సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు చెందిన 9 శాఖలలోఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. శిశు సంరక్షణ విభాగ సభ్యుడు అహ్మద్ అల్ టర్టొర్ తెలిపారు. షార్జా సిటీ, అల్ హమ్రియా, అల్ ధైడ్, అల్ బటేచ్, అల్ మదం, దిబబ్బాఅల్ హిస్న్, మలిహ, కల్బా, ఖోర్ ఫక్కాన్ ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి