సౌదీ అరేబియా జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్న ఏ.పి వాసులు
- February 18, 2018

సౌదీ అరేబియా:సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రియాధ్లోని ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ అంథోని ఆంధ్రప్రదేశ్ స్టాల్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడి, పర్యాటక రంగంలో ఉన్న అవకాశాల గురించి సందర్శకులకు వివరించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ గతవారం ప్రారంభించిన జనాద్రీయ ఉత్సవాలకు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కూడా ప్రత్యేకంగా హాజరైన సంగతి తెలిసిందే. భారత్కు కేటాయించిన ప్రత్యేక స్థలంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని నిర్వహించారు. భారతీయ రాయబారి అహ్మద్ జావెద్ ఇతర సీనియర్ దౌత్యవేత్తలు, సౌదీ అరేబియా అధికారులు, ఆంధ్రపదేశ్ వేదికను సందర్శించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తరుణ్,వర్మ,సుమన్,సత్యం,విజయ ఆంథోనీకి మరియు క్లాసికల్ డాన్సర్స్ నమ్రత,రిత్విక,అశోక్ కు అంథోని ధన్యవాదాలు తెలియజేసారు.




తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









