సౌదీ అరేబియా జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్న ఏ.పి వాసులు
- February 18, 2018

సౌదీ అరేబియా:సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రియాధ్లోని ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ అంథోని ఆంధ్రప్రదేశ్ స్టాల్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడి, పర్యాటక రంగంలో ఉన్న అవకాశాల గురించి సందర్శకులకు వివరించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ గతవారం ప్రారంభించిన జనాద్రీయ ఉత్సవాలకు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కూడా ప్రత్యేకంగా హాజరైన సంగతి తెలిసిందే. భారత్కు కేటాయించిన ప్రత్యేక స్థలంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని నిర్వహించారు. భారతీయ రాయబారి అహ్మద్ జావెద్ ఇతర సీనియర్ దౌత్యవేత్తలు, సౌదీ అరేబియా అధికారులు, ఆంధ్రపదేశ్ వేదికను సందర్శించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తరుణ్,వర్మ,సుమన్,సత్యం,విజయ ఆంథోనీకి మరియు క్లాసికల్ డాన్సర్స్ నమ్రత,రిత్విక,అశోక్ కు అంథోని ధన్యవాదాలు తెలియజేసారు.




తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







