భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ దూరం, క్రికెట్ అభిమానులకు చేదువార్త!

- February 19, 2018 , by Maagulf
భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ దూరం, క్రికెట్ అభిమానులకు చేదువార్త!

టీమిండియా క్రికెట్ అభిమానులకు చేదువార్త ఎదురవబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లను వన్డే సిరీస్ లో ఓడించి t20 సిరీస్ కైవసం దిశగా అడుగులు వేస్తుంది టీమిండియా. ఆదివారం జరిగిన మొదటి t20 లో భారత్ శుభారంభాన్నిచ్చింది. ఆ మ్యాచ్ లో భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో బుధవారం జరిగే రెండవ t20 కి కోహ్లీ ఆడటం అనుమానమేనన్న భావన వ్యక్తం చేస్తున్నారు జట్టు ఆటగాళ్లు. ఈ క్రమంలో వచ్చే రెండు నెలల్లో కీలక సిరీస్ ను ఎదుర్కోవాలి కనుక ప్రస్తుతం కోహ్లీకి సాధ్యమయినంత ఫిట్నెస్ అవసరం. గాయపడ్డ కోహ్లీ బుధవారం మ్యాచ్ ఆడితే గాయం మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. దాంతో వచ్చే సిరీస్ లో పాల్గొనటం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ రెండవ t20 కి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఒకవేళ కోహ్లీ మ్యాచ్ కు దూరంగా ఉన్నట్టయితే జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశముంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com