భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ దూరం, క్రికెట్ అభిమానులకు చేదువార్త!
- February 19, 2018
టీమిండియా క్రికెట్ అభిమానులకు చేదువార్త ఎదురవబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లను వన్డే సిరీస్ లో ఓడించి t20 సిరీస్ కైవసం దిశగా అడుగులు వేస్తుంది టీమిండియా. ఆదివారం జరిగిన మొదటి t20 లో భారత్ శుభారంభాన్నిచ్చింది. ఆ మ్యాచ్ లో భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో బుధవారం జరిగే రెండవ t20 కి కోహ్లీ ఆడటం అనుమానమేనన్న భావన వ్యక్తం చేస్తున్నారు జట్టు ఆటగాళ్లు. ఈ క్రమంలో వచ్చే రెండు నెలల్లో కీలక సిరీస్ ను ఎదుర్కోవాలి కనుక ప్రస్తుతం కోహ్లీకి సాధ్యమయినంత ఫిట్నెస్ అవసరం. గాయపడ్డ కోహ్లీ బుధవారం మ్యాచ్ ఆడితే గాయం మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. దాంతో వచ్చే సిరీస్ లో పాల్గొనటం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ రెండవ t20 కి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఒకవేళ కోహ్లీ మ్యాచ్ కు దూరంగా ఉన్నట్టయితే జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశముంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి