సిరియాలో చిన్నారుల మృతి పట్ల ఐక్యరాజ్య సమితి కన్నెర్ర చేసింది
- February 20, 2018
న్యూయార్క్్: సిరియాలో చిన్నారుల మృతి పట్ల ఐక్యరాజ్య సమితి కన్నెర్ర చేసింది. గౌటా నగరంలో సిరియా సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య ఐదు రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో మంగళవారం నాటికి 127 మంది మృతి చెందారు. వీరిలో 39 మంది చిన్నారులు ఉన్నారు. 'సిరియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుము కున్నాయి. సైన్యం, తిరుగు బాటు దారులకు మధ్య జరుగు తున్న పోరులో అభం శుభం తెలియని చిన్నారులు చని పోయారు. పిల్లల మృతితో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. సిరియాలో శాంతిస్థాపన కోసం ప్రతీ ఒక్కదేశం కృషి చేయాలి' అని యూనిసెఫ్ రీజియన్ డైరెక్టర్ గీర్త్ కెప్లేర్ అన్నారు. ఈ ఘటనపై బ్లాంక్ స్టేట్మెంట్ విడుదల చేస్తు న్నామని అన్నారు. సిరియాలో చిన్నారుల పరిస్థితి దుర్భ రంగా మారిందన్నారు. కాగా, సిరియాలోని గౌటా నగరం 2012 నుంచి తిరుగుబాటుదారుల ఆధీ నంలో ఉంది. ఈనగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకో వాలని సిరియా అధ్యక్షుడు అస్సద్ భావిస్తున్నారు. ఈనే పథ్యంలో గౌటాలో తలదాచుకున్న తిరుగుబాటు దారులను తరిమివేసేందుకు సిరియా సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







