డ్రీమ్ బోయ్ మాధవన్ 17 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తో..

- February 21, 2018 , by Maagulf
డ్రీమ్ బోయ్ మాధవన్ 17 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తో..

 ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, డ్రీమ్ బోయ్ మాధవన్ ల క్యాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది.. ఈ సినిమాకి 'విన్నై తాండి వరువాయా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది 'ఏ మాయ చేశావే' సినిమాకి సీక్వెల్.. స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మాధవన్ తో పాటు మరో ఇద్దరు హీరోలను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ హిట్ జోడి 17 ఏళ్ల కిత్రం 'మిన్నాలే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులోనూ 'చెలి' పేరుతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు క్యాంబినేషన్ లో కొత్త చిత్ర రానుండటంతో అప్పుడే భారీ అంచనాలు ప్రారంభమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com