కువైట్ లోని రహదారులన్నింటిని నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తారు
- February 21, 2018
కువైట్:కువైట్ లోని అన్ని ప్రధాన రహదారులు నిఘా కెమెరాల సహాయంతో వారంలో 24 గంటల పాటు పర్యవేక్షణను కొనసాగిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్రాఫిక్ వ్యవహారాల సహాయక సహాయమంత్రి మేజర్ జనరల్ ఫహ్ద్ అల్ షువేవా తెలిపారు. ట్రాఫిక్ విభాగం 269 స్థిర , సంచార కెమెరాలతో పాటు179 ఉన్నత సాంకేతికతతో కూడిన ప్రత్యేకమైన కెమెరాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో అమర్చబడ్డాయి. రోజువారీగ 190 నుంచి 200 ట్రాఫిక్ వైవిధ్యమైన ప్రమాదాలు జరిగే చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.2017 లో జెనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 70,000 కంటే ఎక్కువ ట్రాఫిక్ ప్రమాదాలను నమోదు చేసింది, దాని ఫలితంగా 428 మంది ప్రజలు తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయారు. అలాగే, 10,000 మందికి పైగా గాయపడ్డారు. అదేవిధంగా లైసెన్సు లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన 164 మంది ప్రవాసీయులను దేశం నుండి పంపించవేయబడ్డారు. తీవ్రమైన ఉల్లంఘనలను మంత్రిత్వ శాఖ ఎట్టి పరిస్థితులలో సహించబోదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







