ఫోన్‌ నంబర్ల మార్పుపై స్పందించిన 'డీవోటీ'..

- February 21, 2018 , by Maagulf
ఫోన్‌ నంబర్ల మార్పుపై స్పందించిన 'డీవోటీ'..

త్వరలో 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్‌ నంబర్‌ను 13 సంఖ్యలకు మారుస్తున్నట్టు బుధవారం సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. ఇక దీనిపై బుధవారమే స్పందించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కేవలం మెషిన్ టు మెషిన్(ఎం2ఎం) కు మాత్రమే భద్రతా కారణాలరీత్యా 10 సంఖ్యలను 13 కు మారుస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ BSNL కూడా నంబర్ల మార్పు ఉండదని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. మరింత భద్రత కోసం వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎం2ఎం సిమ్‌లలో 13 సంఖ్యల నంబర్‌ను జూలై 1 నుంచి జారీ చేయాలని డీవోటీ అన్ని టెలికం కంపెనీలను జనవరిలో ఆదేశించింది. అందులో భాగంగానే ఈ ప్రచారం జరిగింది ఇది కేవలం మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సిమ్ లకు మాత్రమే వర్తిస్తుందని సాధారణ ఫోన్ నంబర్లలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com