మోస్ట్ వాంటెడ్ నిందితుడ్ని కేరళ పోలీసులకు అప్పగింత
- February 24, 2018మనామా: వెకేషన్లో స్వదేశానికి వెళ్ళ అక్కడ హత్యకు పాల్పడిన ఓ నిందితుడ్ని బహ్రెయిన్ పోలీసులు, కేరళ పోలీసులకు అప్పగించారు. 28 ఏళ్ళ అరుణ్ కరుణాకరన్, 66 ఏళ్ళ పివి జానకి అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అయితే పోలీసుల్ని, ప్రజల్ని మిస్లీడ్ చేసిన నిందితుడు, బహ్రెయిన్కి ఫిబ్రవరి 4న చేరుకున్నాడు. గత రెండేళ్ళుగా బహ్రెయిన్లో పనిచేస్తున్నాడు అరుణ్ కరుణాకరన్. డిసెంబర్ 13న కేరళలోని చీమెని గ్రామంలో హత్య జరిగింది. పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని గుర్తించారు. బహ్రెయిన్ పోలీసులకు, కేరళ పోలీసులు సమాచారమందించడంతో, బహ్రెయిన్ పోలీసులు నిందితుడ్ని తాజాగా కేరళ పోలీసులకు అప్పగించడం జరిగింది. సోషల్ వర్కర్ సబైర్ కన్నుర్, నిందితుడితో మాట్లాడగా, నేరాన్ని అంగీకరించారు. నిందితుడితో కలిసి సబిర్ కన్నుర్ కేరళకు వెళ్ళి, పోలీసులకు అతన్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









