మోస్ట్ వాంటెడ్ నిందితుడ్ని కేరళ పోలీసులకు అప్పగింత
- February 24, 2018మనామా: వెకేషన్లో స్వదేశానికి వెళ్ళ అక్కడ హత్యకు పాల్పడిన ఓ నిందితుడ్ని బహ్రెయిన్ పోలీసులు, కేరళ పోలీసులకు అప్పగించారు. 28 ఏళ్ళ అరుణ్ కరుణాకరన్, 66 ఏళ్ళ పివి జానకి అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అయితే పోలీసుల్ని, ప్రజల్ని మిస్లీడ్ చేసిన నిందితుడు, బహ్రెయిన్కి ఫిబ్రవరి 4న చేరుకున్నాడు. గత రెండేళ్ళుగా బహ్రెయిన్లో పనిచేస్తున్నాడు అరుణ్ కరుణాకరన్. డిసెంబర్ 13న కేరళలోని చీమెని గ్రామంలో హత్య జరిగింది. పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని గుర్తించారు. బహ్రెయిన్ పోలీసులకు, కేరళ పోలీసులు సమాచారమందించడంతో, బహ్రెయిన్ పోలీసులు నిందితుడ్ని తాజాగా కేరళ పోలీసులకు అప్పగించడం జరిగింది. సోషల్ వర్కర్ సబైర్ కన్నుర్, నిందితుడితో మాట్లాడగా, నేరాన్ని అంగీకరించారు. నిందితుడితో కలిసి సబిర్ కన్నుర్ కేరళకు వెళ్ళి, పోలీసులకు అతన్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







