సిరియాలో వైమానిక దాడులు నిలిపివేత
- February 25, 2018
*తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన భద్రతా మండలి
ఐక్యరాజ్యసమితి: అంతర్యుద్ధం కారణంగా ఇక్కట్ల పాలవుతున్న ప్రజలను ఆదుకునేందుకు వీలుగా 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలంటూ సిరియాలో ప్రభుత్వ, తిరుగుబాటు వర్గాలను ఐక్యరాజ్యసమితి ఆదేశించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎన్నికైన శాశ్వత సభ్యులు (ఇ10) బృందం మిగిలిన ఐదుగురు శాశ్వత సభ్యులపై వత్తిడి తెచ్చి ఏకగ్రీవంగా ఆమోదించేందుకు మార్గం సుగమం చేశారు. దీనితో సిరియాలో ఎటువంటిజాప్యమూ లేకుండా ఉభయ వర్గాలూ కాల్పు విరమణను పాటించాలని కోరుతున్న ఈ తీర్మానానికి మండలి ఏకగ్రవ ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనలపై దాదాపు రెండు రోజుల పాటు వాయిదాల పర్వం కొనసాగిన తరువాత కువైట్, స్వీడన్ వంటి దేశాల మద్దతుతో పి10 సభ్యదేశాల ప్రతినిధులు చర్చలుజరపటంతో రష్యాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు దీనికి అంగీకరించాయి. తీర్మానం మండలి ఆమోదం పొందిన అనంతరం అధ్యక్ష స్థానంలో ఉన్న కువైట్ ప్రతినిధి మన్సూర్ అయ్యద్ అల్ ఒతైబీ మీడియాతో మాట్లాడుతూ 'మండలి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించటంతో ఏడేళ్ల ఈ ఘర్షణలకు తెరదించిన రాజకీయ పరిష్కార సాధనకు మార్గం సుగమమవుతుందని ఆశిస్తున్నామ'ని అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







