సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి 13 రౌండ్ల కాల్పులు
- February 26, 2018
షిల్లాంగ్ : సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మేఘాలయలోని సౌత్ వెస్ట్ కాశీ హిల్స్లో ఆదివారం ఉదయం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ తనకు సెలవు కావాలని అసిస్టెంట్ కమాండంట్ ముఖేష్ సీ త్యాగిని కోరాడు. దేశ్వాల్కు సెలవు ఇచ్చేందుకు త్యాగి నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన దేశ్వాల్ తన సర్వీస్ రైఫిల్తో త్యాగిపై 13 రౌండ్ల కాల్పులు జరపడంతో.. అసిస్టెంట్ కమాండంట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కానిస్టేబుల్ జోగిందర్ కుమార్, ఎస్ఐ ఓం ప్రకాశ్ యాదవ్, ఇన్స్పెక్టర్ ప్రదీప్ మీనా ఉన్నారు. కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. అతడి సర్వీస్ రైఫిల్ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







