సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి 13 రౌండ్ల కాల్పులు
- February 26, 2018
షిల్లాంగ్ : సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మేఘాలయలోని సౌత్ వెస్ట్ కాశీ హిల్స్లో ఆదివారం ఉదయం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ తనకు సెలవు కావాలని అసిస్టెంట్ కమాండంట్ ముఖేష్ సీ త్యాగిని కోరాడు. దేశ్వాల్కు సెలవు ఇచ్చేందుకు త్యాగి నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన దేశ్వాల్ తన సర్వీస్ రైఫిల్తో త్యాగిపై 13 రౌండ్ల కాల్పులు జరపడంతో.. అసిస్టెంట్ కమాండంట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కానిస్టేబుల్ జోగిందర్ కుమార్, ఎస్ఐ ఓం ప్రకాశ్ యాదవ్, ఇన్స్పెక్టర్ ప్రదీప్ మీనా ఉన్నారు. కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. అతడి సర్వీస్ రైఫిల్ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి