సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి 13 రౌండ్ల కాల్పులు
- February 26, 2018
షిల్లాంగ్ : సెలవు ఇవ్వలేదనే కోపంతో.. ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మేఘాలయలోని సౌత్ వెస్ట్ కాశీ హిల్స్లో ఆదివారం ఉదయం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ తనకు సెలవు కావాలని అసిస్టెంట్ కమాండంట్ ముఖేష్ సీ త్యాగిని కోరాడు. దేశ్వాల్కు సెలవు ఇచ్చేందుకు త్యాగి నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన దేశ్వాల్ తన సర్వీస్ రైఫిల్తో త్యాగిపై 13 రౌండ్ల కాల్పులు జరపడంతో.. అసిస్టెంట్ కమాండంట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కానిస్టేబుల్ జోగిందర్ కుమార్, ఎస్ఐ ఓం ప్రకాశ్ యాదవ్, ఇన్స్పెక్టర్ ప్రదీప్ మీనా ఉన్నారు. కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. అతడి సర్వీస్ రైఫిల్ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









