45 రోజులు మూతపడనున్న దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్ వే
- February 26, 2018
దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) సదరన్ రన్ వే 45 రోజులపాటు మూసివేయబడ్తున్నట్లు వెల్లడించింది. భద్రతను పెంచేందుకు, సర్వీస్ మరియు కెపాసిటీ లెవల్స్ని పెంచేందుకుగాను పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టనున్న దరిమిలా ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. రోజుకి 1,100 విమానాల మూమెంట్తో నిత్యం బిజీగా వుంటుంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. 60,000 టన్నుల అఫ్సాల్ట్, 8,000 టన్నుల కాంక్రీట్తో ఈ అభివృద్ధి పనుల్ని చేపడతారు. ఈ క్రమంలోనే 800 కిలోమీటర్ల పొడవైన ప్రైమరీ కేబుల్స్ని ఏర్పాటు చేయడం, 5,500 రన్ వే లైట్స్ని సరికొత్తగా తీర్చిదిద్దడం వంటి పనులు జరుగుతాయి. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







