45 రోజులు మూతపడనున్న దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్ వే
- February 26, 2018
దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) సదరన్ రన్ వే 45 రోజులపాటు మూసివేయబడ్తున్నట్లు వెల్లడించింది. భద్రతను పెంచేందుకు, సర్వీస్ మరియు కెపాసిటీ లెవల్స్ని పెంచేందుకుగాను పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టనున్న దరిమిలా ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. రోజుకి 1,100 విమానాల మూమెంట్తో నిత్యం బిజీగా వుంటుంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. 60,000 టన్నుల అఫ్సాల్ట్, 8,000 టన్నుల కాంక్రీట్తో ఈ అభివృద్ధి పనుల్ని చేపడతారు. ఈ క్రమంలోనే 800 కిలోమీటర్ల పొడవైన ప్రైమరీ కేబుల్స్ని ఏర్పాటు చేయడం, 5,500 రన్ వే లైట్స్ని సరికొత్తగా తీర్చిదిద్దడం వంటి పనులు జరుగుతాయి. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి