45 రోజులు మూతపడనున్న దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్ వే
- February 26, 2018
దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) సదరన్ రన్ వే 45 రోజులపాటు మూసివేయబడ్తున్నట్లు వెల్లడించింది. భద్రతను పెంచేందుకు, సర్వీస్ మరియు కెపాసిటీ లెవల్స్ని పెంచేందుకుగాను పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టనున్న దరిమిలా ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. రోజుకి 1,100 విమానాల మూమెంట్తో నిత్యం బిజీగా వుంటుంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. 60,000 టన్నుల అఫ్సాల్ట్, 8,000 టన్నుల కాంక్రీట్తో ఈ అభివృద్ధి పనుల్ని చేపడతారు. ఈ క్రమంలోనే 800 కిలోమీటర్ల పొడవైన ప్రైమరీ కేబుల్స్ని ఏర్పాటు చేయడం, 5,500 రన్ వే లైట్స్ని సరికొత్తగా తీర్చిదిద్దడం వంటి పనులు జరుగుతాయి. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









