45 రోజులు మూతపడనున్న దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్ వే
- February 26, 2018
దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) సదరన్ రన్ వే 45 రోజులపాటు మూసివేయబడ్తున్నట్లు వెల్లడించింది. భద్రతను పెంచేందుకు, సర్వీస్ మరియు కెపాసిటీ లెవల్స్ని పెంచేందుకుగాను పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టనున్న దరిమిలా ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నారు. రోజుకి 1,100 విమానాల మూమెంట్తో నిత్యం బిజీగా వుంటుంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. 60,000 టన్నుల అఫ్సాల్ట్, 8,000 టన్నుల కాంక్రీట్తో ఈ అభివృద్ధి పనుల్ని చేపడతారు. ఈ క్రమంలోనే 800 కిలోమీటర్ల పొడవైన ప్రైమరీ కేబుల్స్ని ఏర్పాటు చేయడం, 5,500 రన్ వే లైట్స్ని సరికొత్తగా తీర్చిదిద్దడం వంటి పనులు జరుగుతాయి. ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







