వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు 'కళారత్న' పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- February 26, 2018
అమరావతి: ఈ ఏడాది 'విళంబి' నామ సంవత్సరం సందర్భంగా ఉగాది రోజున వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు కళారత్న (హంస) పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయ్భాస్కర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రముఖులు మార్చి 7వ తేదీ లోపు బయోడేటాతో కూడిన దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో పద్మ అవార్డులు, సంగీత నాటక, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందిన వారిని ఈ అవార్డులకు పరిశీలించే విషయమై ఎంపిక సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బయోడేటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల బిల్డింగ్, దుర్గాపురం, విజయవాడ అడ్ర్సకు పంపించాలని చెప్పారు. లేకుంటే [email protected] మెయిల్కు పంపించవచ్చునని అన్నారు. అభ్యర్థుల తరుఫున ఇతరులు కూడా ప్రతిపాదనలు పంపించవచ్చునన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







