వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు 'కళారత్న' పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- February 26, 2018
అమరావతి: ఈ ఏడాది 'విళంబి' నామ సంవత్సరం సందర్భంగా ఉగాది రోజున వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు కళారత్న (హంస) పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయ్భాస్కర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రముఖులు మార్చి 7వ తేదీ లోపు బయోడేటాతో కూడిన దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో పద్మ అవార్డులు, సంగీత నాటక, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందిన వారిని ఈ అవార్డులకు పరిశీలించే విషయమై ఎంపిక సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బయోడేటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల బిల్డింగ్, దుర్గాపురం, విజయవాడ అడ్ర్సకు పంపించాలని చెప్పారు. లేకుంటే [email protected] మెయిల్కు పంపించవచ్చునని అన్నారు. అభ్యర్థుల తరుఫున ఇతరులు కూడా ప్రతిపాదనలు పంపించవచ్చునన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









