వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు 'కళారత్న' పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- February 26, 2018
అమరావతి: ఈ ఏడాది 'విళంబి' నామ సంవత్సరం సందర్భంగా ఉగాది రోజున వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు కళారత్న (హంస) పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయ్భాస్కర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రముఖులు మార్చి 7వ తేదీ లోపు బయోడేటాతో కూడిన దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో పద్మ అవార్డులు, సంగీత నాటక, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందిన వారిని ఈ అవార్డులకు పరిశీలించే విషయమై ఎంపిక సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బయోడేటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల బిల్డింగ్, దుర్గాపురం, విజయవాడ అడ్ర్సకు పంపించాలని చెప్పారు. లేకుంటే [email protected] మెయిల్కు పంపించవచ్చునని అన్నారు. అభ్యర్థుల తరుఫున ఇతరులు కూడా ప్రతిపాదనలు పంపించవచ్చునన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి