సిరియాలో రసాయనిక దాడులు !
- February 26, 2018
- గౌటాలో పౌరులను బంధీలుగా మల్చుకున్న వైపీజీ : రష్యా రక్షణ శాఖ
మాస్కో : సిరియాలో రసాయనిక దాడులకు పాల్పడేం దుకు తిరుగుబాటుదారులు కుట్ర పన్నారని రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. గౌటా నగరంలోకి చొరబడి కొంతమంది పౌరులను వైపీజీ తిరుగుబాటు దారులు బంధీలుగా మల్చుకున్నారని తెలిపింది. గౌటాలో అశాంతి యుత వాతావరణం సృష్టించేం దుకు తిరుగుబాటుదారులు కుట్ర పన్నారని పేర్కొన్నది. ఈ ప్రాంతంలో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి గతవారం నిర్ణయించింది. ఐరాస నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడే ప్రమాదముందని మేజర్ జనరల్ యూరీ యెవ్తుషెంకో హెచ్చరించారు. సిరియాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రసాయనిక దాడులు జరిగాయని యూరీ తెలిపారు. డమాస్కస్లో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస తీర్మానించినప్పటికీ తిరుగుబాటుదారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







