సిరియాలో కాల్పుల విరమణ ఉల్లంఘన
- February 27, 2018
సిరియాలో శాంతి స్థాపన కోసం ఐరాస ప్రయత్నిస్తోంది. ఈ మేరకు 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సిరియా బలగాలను, తిరుగుబాటుదారులను సూచించింది. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరులో దాదాపు 700 మందికి పైగా చనిపోవడంతో ఐరాస భద్రతా మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించినట్టయితే తమ ఉనికి కోల్పోతామనే ఫోబియాతో తిరుగుబాటుదారులు గౌటా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఐరాస భద్రతా మండలి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటుదారులు జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రులు, భవనాలు, వందలకొద్ది ఇండ్లు ధ్వంసమయ్యాయి. గౌటాలో నెత్తురు ఏరులై పారుతోంది. గౌటాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలనే లక్ష్యంతో ఈనెల 25న ఐరాస భద్రతా మండలి సమావేశం జరిగింది. తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సిరియా మిత్రదేశమైన రష్యా కూడా ఓటేసింది. సిరియా రాజధాని డమాస్కస్ శివారు నగరమైన గౌటా నగరం 2013 నుంచి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







