సిరియాలో కాల్పుల విరమణ ఉల్లంఘన
- February 27, 2018
సిరియాలో శాంతి స్థాపన కోసం ఐరాస ప్రయత్నిస్తోంది. ఈ మేరకు 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సిరియా బలగాలను, తిరుగుబాటుదారులను సూచించింది. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరులో దాదాపు 700 మందికి పైగా చనిపోవడంతో ఐరాస భద్రతా మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించినట్టయితే తమ ఉనికి కోల్పోతామనే ఫోబియాతో తిరుగుబాటుదారులు గౌటా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఐరాస భద్రతా మండలి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటుదారులు జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రులు, భవనాలు, వందలకొద్ది ఇండ్లు ధ్వంసమయ్యాయి. గౌటాలో నెత్తురు ఏరులై పారుతోంది. గౌటాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలనే లక్ష్యంతో ఈనెల 25న ఐరాస భద్రతా మండలి సమావేశం జరిగింది. తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సిరియా మిత్రదేశమైన రష్యా కూడా ఓటేసింది. సిరియా రాజధాని డమాస్కస్ శివారు నగరమైన గౌటా నగరం 2013 నుంచి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









