భూమికి చేరిన నాసా వ్యోమగాములు
- February 27, 2018
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో పనిచేసిన ముగ్గరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు, రష్యాకు చెందిన ఓ వ్యోమగామి ఈరోజు ఉదయం కజకిస్థాన్లో ల్యాండ్ అయ్యారు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ మిసర్కిన్, అమెరికాలోని నాసా వ్యోమగాములు మార్క్ వాండే, జోయ్ అకాబా అయిదు నెలల పాటు ఐఎస్ఎస్లో పనిచేసి కిందకు వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి ల్యాండ్ అయ్యే ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం పూర్తయిందని, ముగ్గురు సురక్షితంగా ఉన్నారని రష్యా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. 40ఏళ్ల మిసర్కిన్ నిన్న ఐఎస్ఎస్ కమాండ్ పదవిని ఆంటోన్ షకప్లెరోవ్కు అప్పగించారు. మిస్కరిన్ రెండు మిషన్లలో 334 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. 50ఏళ్ల జోయ్ అకాబా మూడు మిషన్లలో కలిపి పది నెలలు అంతరిక్షంలో ఉన్నారు. మరో వ్యోమగామి మార్క్ వాండే తొలిసారి అంతరిక్షంలో ఉండి వచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







