భూమికి చేరిన నాసా వ్యోమగాములు
- February 27, 2018
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో పనిచేసిన ముగ్గరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు, రష్యాకు చెందిన ఓ వ్యోమగామి ఈరోజు ఉదయం కజకిస్థాన్లో ల్యాండ్ అయ్యారు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ మిసర్కిన్, అమెరికాలోని నాసా వ్యోమగాములు మార్క్ వాండే, జోయ్ అకాబా అయిదు నెలల పాటు ఐఎస్ఎస్లో పనిచేసి కిందకు వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి ల్యాండ్ అయ్యే ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం పూర్తయిందని, ముగ్గురు సురక్షితంగా ఉన్నారని రష్యా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. 40ఏళ్ల మిసర్కిన్ నిన్న ఐఎస్ఎస్ కమాండ్ పదవిని ఆంటోన్ షకప్లెరోవ్కు అప్పగించారు. మిస్కరిన్ రెండు మిషన్లలో 334 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. 50ఏళ్ల జోయ్ అకాబా మూడు మిషన్లలో కలిపి పది నెలలు అంతరిక్షంలో ఉన్నారు. మరో వ్యోమగామి మార్క్ వాండే తొలిసారి అంతరిక్షంలో ఉండి వచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









