ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ తరలింపుకి బ్రేక్
- February 28, 2018
మస్కట్: ఒమనీ స్కూల్ స్టూడెంట్ ఒకరు ఇచ్చిన సమాచారంతో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ అధికారులు షామ్ రపాంతంలో ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ని తీసుకెళుతున్న ట్రక్ని అడ్డగించారు. అగ్రికల్చరల్ విలేజెస్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ని నిందితులు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ చెట్లను తరలిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ 21 క్వారంటీన్డ్ ఎగ్రికల్చర్ ఏరియాస్ని సుల్తానేట్లో గుర్తించింది. ఆరోగ్యకరమైన ప్రాంతాలకు వీటిని తరలించకుండా వుండేందుకు నిషేధాజ్ఞలు కూడా విధించడం జరిగింది. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించేవారికి మూడు నెలల వరకు జైలు శిక్ష, 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. పదే పదే నిషేధాజ్ఞల్ని ఉల్లంఘిస్తే జరీమానా, జైలు శిక్ష రెట్టింపవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







