క్రైస్తవులు, ముస్లింలకు మధ్య ఘర్షణ,13 మంది మృతి

- February 28, 2018 , by Maagulf
క్రైస్తవులు, ముస్లింలకు మధ్య ఘర్షణ,13 మంది మృతి

సెంట్రల్ నైజీరియాలో క్రైస్తవులు, ముస్లిం యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చాలా వరకు ఇండ్లు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కదునా స్టేట్ రాజధాని కదునా పట్టణంలో ఈ ఘర్షణలు నెలకొన్నాయి. ఘర్షణకు కారణమైన 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌కమిషనర్ ఆస్టిన్ ఐవర్ తెలిపారు. భద్రతా దళాలు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చాయిని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఐవర్ వెల్లడించారు. కొందరు క్రైస్తవ అమ్మాయిలు, ముస్లిం యువకులతో సన్నిహితంగా ఉండటమే ఈ ఘర్షణకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అప్పుడే నిర్ధారణకు రాలేమని..పూర్తి దర్యాప్తు చేపడుతామని ఆస్టిన్ ఐవర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com