గల్ఫ్ లో అసువులుబాసిన మరో యువతి
- February 28, 2018
మామిడికుదురు: మండలంలోని పెదపట్నం గ్రామ పరిధిలోని అగ్రహారానికి చెందిన బత్తుల వరలక్ష్మి(27) గల్ఫ్లో మృతి చెందినట్లు ఆలస్యంగా సమాచారం వచ్చింది. గత ఏడాది డిసెంబరు 18వ తేదీన ఆమె చనిపోయినా మంగళవారం సమాచారం తెలియజేయడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏజెంటు వేధింపుల వల్లే ఆమె చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన బత్తుల సత్యనారాయణమూర్తి, పెద్దిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్దమ్మాయి వరలక్ష్మి గత ఏడాది ఏప్రిల్లో ఉపాధి కోసం బెహ్రెయిన్ వెళ్లింది. గత డిసెంబరు 8న కుటుంబ సభ్యులకు చివరిసారిగా ఫోన్ చేసి మాట్లాడింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న చెల్లెలు శ్రీవాణికి డిసెంబరు 14న ఫోన్ చేసినా ఇంట్లోనే ఫోన్ ఉండిపోవడంతో మాట్లాడటం కుదరలేదు. మళ్లీ అప్పట్నించీ ఏవిధమైన సమాచారం లేదు. అక్కడే ఉంటున్న విజయవాడకు చెందిన ఓ మహిళ అక్కడి చర్చి వద్ద తనకు తెలిసిన ఈ సమాచారాన్ని కుటుంబికులకు అందజేసింది. న్యాయవాది నల్లి శంకర్ విషయాన్ని రాయబార కార్యాలయానికి నివేదించడంతో వరలక్ష్మి మృతి చెందినట్లు వెల్లడైందని తల్లిదండ్రులతోపాటు కుటుంబికులు బత్తుల అశోక్, భూపతి దుర్గాప్రసాద్ బుధవారం విలేకరులకు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చింతలపల్లికి చెందిన ఓ మహిళా ఏజెంటు డబ్బు కోసం తరచూ ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







