గల్ఫ్ లో అసువులుబాసిన మరో యువతి
- February 28, 2018
మామిడికుదురు: మండలంలోని పెదపట్నం గ్రామ పరిధిలోని అగ్రహారానికి చెందిన బత్తుల వరలక్ష్మి(27) గల్ఫ్లో మృతి చెందినట్లు ఆలస్యంగా సమాచారం వచ్చింది. గత ఏడాది డిసెంబరు 18వ తేదీన ఆమె చనిపోయినా మంగళవారం సమాచారం తెలియజేయడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏజెంటు వేధింపుల వల్లే ఆమె చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన బత్తుల సత్యనారాయణమూర్తి, పెద్దిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్దమ్మాయి వరలక్ష్మి గత ఏడాది ఏప్రిల్లో ఉపాధి కోసం బెహ్రెయిన్ వెళ్లింది. గత డిసెంబరు 8న కుటుంబ సభ్యులకు చివరిసారిగా ఫోన్ చేసి మాట్లాడింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న చెల్లెలు శ్రీవాణికి డిసెంబరు 14న ఫోన్ చేసినా ఇంట్లోనే ఫోన్ ఉండిపోవడంతో మాట్లాడటం కుదరలేదు. మళ్లీ అప్పట్నించీ ఏవిధమైన సమాచారం లేదు. అక్కడే ఉంటున్న విజయవాడకు చెందిన ఓ మహిళ అక్కడి చర్చి వద్ద తనకు తెలిసిన ఈ సమాచారాన్ని కుటుంబికులకు అందజేసింది. న్యాయవాది నల్లి శంకర్ విషయాన్ని రాయబార కార్యాలయానికి నివేదించడంతో వరలక్ష్మి మృతి చెందినట్లు వెల్లడైందని తల్లిదండ్రులతోపాటు కుటుంబికులు బత్తుల అశోక్, భూపతి దుర్గాప్రసాద్ బుధవారం విలేకరులకు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చింతలపల్లికి చెందిన ఓ మహిళా ఏజెంటు డబ్బు కోసం తరచూ ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..