దొంగతనం: మాల్ సెక్యూరిటీ గార్డ్కి 3 నెలల జైలు
- March 02, 2018
దుబాయ్:మాల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తోన్న 25 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తికి దొంగతనం కేసులో మూడు నెలల జైలు శిక్ష విధింపబడింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. మాల్లోని బ్యాగేజ్ డిపాజిట్ సెక్షన్ నుంచి ఓమహిళకు చెందిన బ్యాగులో ఉన్న 15,000 దిర్హామ్లు, 1,800 దిర్హామ్లు, మరో బ్యాగులోంచి 1,800 దిర్హామ్లను నిందితుడు దొంగిలించాడు. జనవరిలో ఈ దొంగతనాల గురించి ఫిర్యాదు రాగా, నిందితుడ్ని అరెస్టు చేసి బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో విచారించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. షాపింగ్ సెంటర్కి వచ్చేవారి బ్యాగుల నుంచి నగదును దొంగిలించిన మాట వాస్తవమేనని నిందితుడు ఒప్పుకున్నట్లుగా విచారణాధికారి ప్రాసిక్యూటర్కి వివరించారు. నిందితుడికి సంబందించిన స్థలంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు 4,600 డాలర్లు, 310 దిర్హామ్ల సొమ్ముల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







