ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రానికి సన్నాహాలు..
- March 02, 2018
మహేష్బాబు కథానాయకుడిగా రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో ఆయన నటించనున్న 25వ చిత్రానికి మరోవైపు సన్నాహాలు వేగవంతమయ్యాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ పతాకాలపై సి.అశ్వనీదత్, దిల్రాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ పనిచేయనున్నారు. బాలీవుడ్లో 2006లో వచ్చిన డాన్ చిత్రానికి, అలాగే తలాష్, రయీస్ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ని మోహనన్ అందించారు. మహేష్బాబు సరసన పూజాహెగ్డే నాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్, నిర్మాతలు: సి.అశ్వనీదత్, దిల్రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







