ఒమన్లో హోలీ: వేలాదిమంది సంబరాలు
- March 03, 2018
మస్కట్: భారతదేశంలో రంగుల పండుగ అయిన హోలీని, మస్కట్లోనూ వేలాది మంది అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అల్మౌజ్ గోల్ఫ్ క్లబ్లో హోలీ వేడుకలు జరిగాయి. రెండ్రోజుల ఈ ఫెస్టివల్ని ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. స్ప్రింగ్ సీజన్ నేపథ్యంలో ఈ రంగుల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాక్సిస్ ఈవెంట్స్ ఈ వేడుకని ఒమన్ టెల్ సహకారంతో నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన వలసదారులు హోలీ వేడుకల్లో ఉతాష్ట్ర్సహంగా పాల్గొన్నారు. ఫన్ జోన్, ఫుడ్ కోర్ట్ సహా అనేక ప్రత్యేకతలతో హోలీ ఈవెంట్ ఆనందోత్సాహాల నడుమ జరిగింది. 10 నుంచి 15 మంది కళాకారులతో లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్లు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









