జె-వాకింగ్: 50,000 మందికి జరీమానా

- March 03, 2018 , by Maagulf
జె-వాకింగ్: 50,000 మందికి జరీమానా

50,700 మంది దుబాయ్‌ రెసిడెంట్స్‌కి జె-వాకింగ్ నేపథ్యంలో జరీమానా విధించారు గత ఏడాది. పోలీసులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జె-వాకింగ్ 21 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. జె-వాకింగ్ అంటే, నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా రోడ్లపై ఎక్కడికక్కడ నడుస్తూ క్రాస్‌ చేయడం. దీన్ని తప్పిదంగా గుర్తిస్తూ, అక్కడికక్కడ 400 దిర్హామ్‌ల జరీమానా విధించడం జరుగుతోంది. రోడ్లపై నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే దాటాల్సి ఉంటుంది పాదచారులు. అలా కాకుండా ఎక్కడబడితే అక్కడ రోడ్డుని నడిచేవారు క్రాస్‌ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా జరిగే మరణాల్ని తగ్గించడమే లక్ష్యంగా జె-వాకింగ్కి జరీమానాలు విధిస్తున్నారు. జరీమానాలతో జె-వాకింగ్ తగ్గిందనీ, మరణాల సంఖ్య కూడా 21 శాతం వరకు తగ్గిందని అధికారులు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com