జె-వాకింగ్: 50,000 మందికి జరీమానా
- March 03, 2018
50,700 మంది దుబాయ్ రెసిడెంట్స్కి జె-వాకింగ్ నేపథ్యంలో జరీమానా విధించారు గత ఏడాది. పోలీసులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జె-వాకింగ్ 21 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. జె-వాకింగ్ అంటే, నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా రోడ్లపై ఎక్కడికక్కడ నడుస్తూ క్రాస్ చేయడం. దీన్ని తప్పిదంగా గుర్తిస్తూ, అక్కడికక్కడ 400 దిర్హామ్ల జరీమానా విధించడం జరుగుతోంది. రోడ్లపై నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే దాటాల్సి ఉంటుంది పాదచారులు. అలా కాకుండా ఎక్కడబడితే అక్కడ రోడ్డుని నడిచేవారు క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా జరిగే మరణాల్ని తగ్గించడమే లక్ష్యంగా జె-వాకింగ్కి జరీమానాలు విధిస్తున్నారు. జరీమానాలతో జె-వాకింగ్ తగ్గిందనీ, మరణాల సంఖ్య కూడా 21 శాతం వరకు తగ్గిందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







