నాగ అన్వేష్ కొత్త మూవీ ప్రారంభం
- March 04, 2018
యువ కథానాయకుడు నాగ అన్వేష్ నటిస్తున్న కొత్త చిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో ప్రారంభోత్సవం జరుపుకుంది. గణష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేష్, సీహెచ్వీ నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్డూడియోలో ఏ నిమిషానికి ఏమి జరుగునో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశం అనంతరం నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ.లండన్ నివాసిని కాబట్టి లండన్ గణష్ అంటారు. డిసెంబర్లో ఈ సినిమా బృందాన్ని కలిశాను. మా దర్శకుడు మంచి కథతో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె మాట్లాడుతూ.సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆదిత్య 369, పుష్పక విమానం తరహాలో ఉంటుంది. మూడు పాటలుంటాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు. కథానాయకుడు నాగ అన్వేష్ మాట్లాడుతూ.చాలా కొత్త తరహా కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముగింపు వరకు ఏ జరుగుతుందో కథ విన్న నాకే అర్థం కాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది. ముహూర్తం బాగుందని చిత్రాన్ని ప్రారంభించాం. వచ్చే నెల చిత్రీకరణ ఉంటుంది. అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







