జెడ్డా నుంచి వచ్చిన పిల్లి.. కొచ్చి విమానాశ్రయంలో నిర్బంధం!
- March 04, 2018
కేరళ:గల్ఫ్ నుంచి తెచ్చిన పెంపుడు పిల్లిని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వస్తూవస్తూ ఓ భారత జంట వెంట పెంపుడు పిల్లిని తెచ్చుకున్నారు. మార్చి 2న వీరు సౌదీ ఎయిర్లైన్స్లో కొచ్చి చేరుకున్నారు. వెంట పిల్లి ఉండడాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని నిర్బంధించారు. ఈ విమానాశ్రయంలో పెంపుడు జంతువులను తెచ్చుకునే విషయంలో నిషేధం ఉండడంతో వారు వెంటనే సౌదీ ఎయిర్లైన్స్కు సమాచారం అందించారు. పిల్లిని భారత్కు తెస్తున్నట్టు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పిల్లిని తిరిగి జెడ్డాకు పంపాలని కోరారు.
పెంపుడు జంతువులను తెచ్చుకోవాలంటే, ఆయా దేశం నుంచి దాని హెల్త్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







