ఆన్ బోర్డ్ ఫ్లైట్లో భారత మహిళ మృతి
- March 05, 2018
మస్కట్: సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ మహిళకు మెడికల్ ఎమర్జన్సీ అవసరమయ్యింది. ఈ నేపథ్యంలో విమానం మస్కట్కి డైవర్ట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ మహిళ మృతి చెందినట్లు మస్కట్లోని ఇండియన్ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. 65 ఏళ్ళ మహిళ సౌదీ అరేబియా నుంచి హైద్రాబాద్కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదీనా నుంచి మార్చి 1న విమానంలో ఆమె హైద్రాబాద్కి పయనమయ్యారు. ఆమెతోపాటు విమానంలో ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఉమ్రా ప్రార్థనల కోసం హైద్రాబాద్ నుంచి ఆమె మదీనా వెళ్ళినట్లు తెలుస్తోంది. షరీఫా బేగమ్ అనే మహిళకు మెడికల్ ఎమర్జన్సీ అవసరమవడంతో మదీనా నుంచి హైద్రాబాద్ వెళ్ళాల్సిన విమానాన్ని మస్కట్కి డైవర్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









