దుబాయ్ విల్లాలో దొంగతనం చేసిన ఐదుగురు శ్రీలంక నిందితులపై విచారణ
- March 05, 2018
దుబాయ్:ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన ఐదుగురు శ్రీలంక వ్యక్తులకు ఓ దుర్బుద్ధి పుట్టింది..దేశం కానీ దేశంలో తమ చోరకళ ప్రదర్శించి నాలుగురాళ్లు వెనకేద్దామను కొన్నారు. కానీ, పట్టుమని పదిరోజులు గడిచేసరికి అనూహ్యంగా ఎనిమిది కట కటాల జైలుగదిలోనికి వెళ్లిపోయారు. వివరాలలోకి వెళితే, అయిదుగురు నిందితులు ఎవరూ లేని తాళాలు పెట్టి ఉన్న ఒక బంగళాను ఎంచుకొన్నారు. ఆ ఇంటి తాళాలు..తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించి పలు విలువైన బంగారు ఆభరణాలతో పాటు 50,000 ధిర్హాంల కన్నా ఎక్కువ నగదు దొంగతనం చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఈ చోరీ కేసు సోమవారం విచారణకు వచ్చింది. స్థానిక కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఈ దొంగతనం చేసిన అయిదుగురు నిందితులపై విచారణ జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ రికార్డుల్లో ఈ దొంగతనంకు పాల్పడిన వారి వయస్సు 29 నుండి 49 ఏళ్ళ మధ్య ఉంది. వీరు మిర్డిఫ్ ప్రాంతంలోని ఒక బంగాళా లోపలకు ప్రవేశించి తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి 50,000 ధిర్హాంల కన్నా ఎక్కువ నగదు అపహరించారు అలాగే బంగారు మరియు డైమండ్ నెక్లెస్, మూడు బంగారు చెవిపోగులు, జుట్టులో పెట్టుకొనే బంగారు పిన్నులు , రెండు గడియారాలు మరియు రెండు పర్సులు 15,000 ధిర్హాంల నగదును దొంగిలించారు. "జూలై 8 వ తేదీ 2016 న నేను నా వార్షిక సెలవులో యూఏఈ వెలుపల మూడు రోజుల పాటు ఉన్నాను, నా బంగాళాలో పనిచేసే తోటమాలి వద్ద నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీరు ప్రధాన ద్వారం తలుపు తెరిచి వెళ్లిపోయారా ? అలాగే వెలుపల ఓ కుర్చీని వదిలిపెట్టారాని నన్ను అడిగాడని దుబాయిలో ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 50 ఏళ్ల పాకిస్తానీ ఫిర్యాదుదారుడు చెప్పారు. అజ్మాన్ లో నివసించిన నా మేనల్లుడిని నా విల్లాకు వెళ్లి పరిశీలించమని సూచించినట్లు అయితే అక్కడ పరిస్థితిని పరిశీలించిన మా బంధువు విల్లా తలుపులు ఎవరో పగలుకొట్టారని ఇంటిలో సామాను చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు నాకు తెలిపాడని పేర్కొన్నాడు. దొంగతనం జరిగిన అయిదు రోజుల తర్వాత నేను నా ఇంటికి వచ్చి బంగారం, వజ్రాల ఆభరణాలు పోయినట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. దొంగిలించిన మొత్తం విలువ 50,000 రూపాయలు ఉంటుందని ఆ ప్రొఫసర్ విలేకరుల ఎదుట వాపోయారు. దోపిడీ జరిగిన పది రోజుల అనంతరం జూలై 18 వ తది 2016 న షార్జాలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు నిందితులను పట్టుకున్నామని పోలీసు యంత్రానగం పేర్కొంది. పోలీసులు తమదైన శైలిలో ఇచ్చిన ఆతిధ్యానికి ఇతర సహచర దొంగల సమాచారం ఇచ్చారు. దీంతో అయిదుగురు నిందితులపై కేసు నమోదు చేసి న్యాయ విచారణ అధికారుల ఎదుటకు ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







