ఒమన్‌లో బస్సు ప్రమాదం: ముగ్గురు స్కూల్‌ స్టూడెంట్స్‌ మృతి

- March 05, 2018 , by Maagulf
ఒమన్‌లో బస్సు ప్రమాదం: ముగ్గురు స్కూల్‌ స్టూడెంట్స్‌ మృతి

మస్కట్‌: జబల్‌ అఖ్‌దర్‌ స్కూల్‌కి చెందిన ముగ్గురు స్టూడెంట్స్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. స్కూల్‌ బస్‌ డ్రైవర్‌, కంట్రోల్‌ తప్పడమే ఈ ప్రమాదానికి కారణంగా రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. నిజ్వా విలాయత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 12 మంది మేల్‌ స్టూడెంట్స్‌ ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని జబల్‌ అఖ్దర్‌ హెల్త్‌ సెంటర్‌కి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది గాయపడ్డవారిని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసినట్లు తెలిపారు పోలీసులు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com