శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు
- March 06, 2018
గత కొన్నేళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్... ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని మంత్రి దిస్సనాయకే మీడియాకు తెలిపారు.
సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మైనార్టీ వర్గీయులపై మెజారిటీ వర్గాలకు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుండటంతో... ప్రభుత్వం అలర్ట్ అయింది. లేట్ అయ్యేకొద్దీ పరిస్థితులు మరింత దిగజారుతాయనే అంచనాలతో ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







