పండ్ల రసాల తయారు చేసే మెషీన్లలో 18 లక్షల మాదక ద్రవ్యాల మాత్రలు
- March 06, 2018
దుబాయ్:మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు నానాటికి విభిన్న పద్ధతులను ఆశ్రయిస్తూ పోలీసుల కళ్ళు గప్పేందుకు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అధికారులు వారి ఎత్తుగడలను నిత్యం చిత్తు చేస్తూనే ఉన్నారు. రోడ్డుపై వేగంగా ఓ వాహనం వెళుతుంది.. ఆ మార్గంలో పహారా ఉన్న నిఘా పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. తనిఖీ నిమిత్తం వాహనం లోపల తొంగి చూస్తే జ్యూస్లు తయారుచేసే మెషీన్లు ఉన్నాయి. మండే వేసవి కదా ...సీజనులో ఇవి రవాణా కావడం మామూలే కదా అని వదిలిపెడితే స్మగ్లర్లు ఎంతో లాభపడిపోయేవారు. దూర దృష్టి కాస్త ఎక్కువ పాళ్ళు ఉన్న దుబాయ్ పోలీసులు వాహనం క్షుణంగా పరిశీలించేందుకు జ్యూస్ పరికరాలని కిందకు దింపించారు. ఆ జ్యూస్ మెషీన్ల విడి భాగాలను ఒక్కొకటి విడదీసి చూస్తే..ఆశ్చర్య పోయేలా 18 లక్షల కాప్టగాన్ మాత్రలు బయటపడ్డాయి. ఈ మాదకద్రవ్య మాత్రలు తీసుకొనేవారిని మెలకువగా ఉంచే, శారీరక నొప్పిని తగ్గించే, మానసిక ఉత్సాహాన్ని పెంచేవే కాప్టగాన్ పిల్స్. వీటిని ఎక్కువగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వాడుతుంటారు. అందుకే వీటిపై పలు దేశాల్లో నిషేధం ఉంది. సోమవారం దుబాయి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు.. అబూదబీ పోలీసులతో కలిసి భారీ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. 18 లక్షల కాప్టగాన్ పిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 159 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీటి అక్రమ రవాణాకు పాల్పడిన అయిదుగురు అరబ్ పౌరులను అరెస్ట్ చేసి విచారించి త్వరలో మొత్తం గుట్టు విప్పుతామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







