దుబాయ్ లాటరీ లో విజేతగా భారతీయుడు.. రూ.6.50 కోట్ల బహుమతి

- March 07, 2018 , by Maagulf
దుబాయ్ లాటరీ లో విజేతగా భారతీయుడు.. రూ.6.50 కోట్ల బహుమతి

దుబాయ్: ఇటీవల పలు గల్ఫ్ లాటరీలు మన భారతీయులకు ఇబ్బడిముబ్బడిగా వరిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు కేరళలో అమ్ముకొంటూ ఓ ఛోటా ఓ వ్యక్తిని లాటరీ కోటీస్వరుడిగా మార్చేసింది కేరళకు చెందిన 40 ఏళ్ల ప్రబిన్ థామస్ అనే వ్యక్తి దుబాయ్ లాటరీలో విజేతగా నెగ్గాడు  అక్షరాలా రూ.6.50 కోట్లకుపైగా(1 మిలియన్ డాలర్లు) డబ్బు ఆ వ్యక్తికి దక్కనుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ లక్కీ డ్రాలో థామస్ మొదటిసారిగా టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఓ పని నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆయన ఆన్‌లైన్లో ఓ టికెట్‌ను కొనుగోలు చేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డ్రా తీయగా థామస్ కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 0471కు లాటరీ దక్కిందని నిర్వహకులు మంగళవారం ప్రకటించారు.  మొదటిసారిగా దుబాయ్ డ్యూటీ ప్రీ లాటరీలో టికెట్‌ను కొనుగోలు చేయగా అదృష్టం వరించిందని ప్రబిన్ థామస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. లాటరీ నిర్వాహకులు థామస్‌కు చెక్‌ను అందజేశాడు. దీంతో థామస్ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని, వీలైతే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపిస్తానని చెపుతున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com