దుబాయ్ లాటరీ లో విజేతగా భారతీయుడు.. రూ.6.50 కోట్ల బహుమతి
- March 07, 2018_1520422142.jpg)
దుబాయ్: ఇటీవల పలు గల్ఫ్ లాటరీలు మన భారతీయులకు ఇబ్బడిముబ్బడిగా వరిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు కేరళలో అమ్ముకొంటూ ఓ ఛోటా ఓ వ్యక్తిని లాటరీ కోటీస్వరుడిగా మార్చేసింది కేరళకు చెందిన 40 ఏళ్ల ప్రబిన్ థామస్ అనే వ్యక్తి దుబాయ్ లాటరీలో విజేతగా నెగ్గాడు అక్షరాలా రూ.6.50 కోట్లకుపైగా(1 మిలియన్ డాలర్లు) డబ్బు ఆ వ్యక్తికి దక్కనుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ లక్కీ డ్రాలో థామస్ మొదటిసారిగా టికెట్ను కొనుగోలు చేశాడు. ఓ పని నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆయన ఆన్లైన్లో ఓ టికెట్ను కొనుగోలు చేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో డ్రా తీయగా థామస్ కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 0471కు లాటరీ దక్కిందని నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. మొదటిసారిగా దుబాయ్ డ్యూటీ ప్రీ లాటరీలో టికెట్ను కొనుగోలు చేయగా అదృష్టం వరించిందని ప్రబిన్ థామస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. లాటరీ నిర్వాహకులు థామస్కు చెక్ను అందజేశాడు. దీంతో థామస్ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని, వీలైతే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపిస్తానని చెపుతున్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి