దుబాయ్ లాటరీ లో విజేతగా భారతీయుడు.. రూ.6.50 కోట్ల బహుమతి
- March 07, 2018
దుబాయ్: ఇటీవల పలు గల్ఫ్ లాటరీలు మన భారతీయులకు ఇబ్బడిముబ్బడిగా వరిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు కేరళలో అమ్ముకొంటూ ఓ ఛోటా ఓ వ్యక్తిని లాటరీ కోటీస్వరుడిగా మార్చేసింది కేరళకు చెందిన 40 ఏళ్ల ప్రబిన్ థామస్ అనే వ్యక్తి దుబాయ్ లాటరీలో విజేతగా నెగ్గాడు అక్షరాలా రూ.6.50 కోట్లకుపైగా(1 మిలియన్ డాలర్లు) డబ్బు ఆ వ్యక్తికి దక్కనుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ లక్కీ డ్రాలో థామస్ మొదటిసారిగా టికెట్ను కొనుగోలు చేశాడు. ఓ పని నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆయన ఆన్లైన్లో ఓ టికెట్ను కొనుగోలు చేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో డ్రా తీయగా థామస్ కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 0471కు లాటరీ దక్కిందని నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. మొదటిసారిగా దుబాయ్ డ్యూటీ ప్రీ లాటరీలో టికెట్ను కొనుగోలు చేయగా అదృష్టం వరించిందని ప్రబిన్ థామస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. లాటరీ నిర్వాహకులు థామస్కు చెక్ను అందజేశాడు. దీంతో థామస్ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని, వీలైతే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపిస్తానని చెపుతున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







