వైఎస్ఆర్ బయోపిక్లో నయనతార
- March 08, 2018
ఎన్టీఆర్ బయోపిక్కి చర్చలు నడుస్తున్న తరుణంలో తెరపైకి వైఎస్ఆర్ కూడా వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు సార్లు పాలించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందారు. ఇప్పుడు ఆయనపై కూడా బయోపిక్ని తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ డైరక్షన్లో ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటీ నటుల వేటలో ఉన్న ఈ చిత్రానికి వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే మమ్ముట్టి సరసన నయన్ని ఎంపిక చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. నయనతార చిరంజీవి పక్కన హీరోయిన్గా సైరాకి కూడా సైన్ చేసింది. పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి తెలుగులో అభిమానులు బాగానే ఉన్నారు. అదే వైఎస్ ఆర్ చిత్రంలో ఎంపికకు దారి తీసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









