మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం

- March 08, 2018 , by Maagulf
మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం

పాల్‌గఢ్‌: మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పేలుడు శబ్దం కంపెనీకి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, ఇళ్లు, భవనాలు కంపించాయని పోలీసులు వెల్లడించారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com