భారత్-ఫ్రాన్స్ మధ్య 14 కీలక ఒప్పందాలు
- March 10, 2018
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ 4 రోజుల భారత పర్యటనలో భాగంగా భారత్-ఫ్రాన్స్ మధ్య 14 కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం సీఈఓల ఫోరంకు హాజరైన ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు సమక్షంలో 14 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగంలో వేళ్లూనుకున్నాయని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.
హిందూ మహాసముద్రంలో విస్తృత సహకారానికి ఇరు దేశాధినేతలు తమ విజన్ ప్రకటించారు. మైగ్రెంట్ మొబిలిటీ, పార్టనర్షిప్ను పటిష్టపరిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ రక్షణ సహకారంలో నూతన చరిత్రను ఆవిష్కరించే ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాలని మోడీ ఫ్రాన్స్ను ఆహ్వానించారు.
భారత్ - ఫ్రాన్స్ మధ్య రక్షణ సహకారానికి కీలక ప్రాధాన్యం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు పోరాడాలాని నిర్ణయించినట్టు చెప్పారు. తర్వాత ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్తో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని బికనీర్ హౌస్లో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. భారత్- ఫ్రాన్స్ దేశాల ప్రజలు, విద్యార్థుల రాకపోకలు రెండు దేశాల్లో మరింత పెరగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







