సచిన్ సినిమాకు అవార్డు
- March 11, 2018
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. ది ఎక్లాడ్ గ్లోబల్ ఫిల్మ్ కాంపిటీషన్-2018లో భాగంగా 2017లో వచ్చిన ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని బాలీవుడు విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సచిన్ క్రికెట్ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంతో తెరకెక్కిన చిత్రానికి జేమ్స్ ఎర్సీన్ దర్శకత్వం వహించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఐదు భాషలు హిందీ, ఇంగ్లీష్, మరాఠి, తెలుగు, తమిళంలో 2017 మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు అవార్డు రావడంతో అభిమానులు సచిన్కు అభినందనలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







