తమిళనాడు:మంటల్లో చిక్కుకున్న 60 మంది విద్యార్థులు
- March 11, 2018
చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా బోడి సమీపంలోని కురంగణి అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపు 60 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక యువతి చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. ఈరోడు, కోయంబత్తూరు నుంచి కళాశాల విజ్ఞాన యాత్ర కోసం విద్యార్థులు అడవుల్లోకి వెళ్లారు.
ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు చెలరేగుతున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నానికి అంతరాయం కలుగుతోంది. సుమారు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులతో సమాచార సంబంధాలు కట్ అవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







