తమిళనాడు:మంటల్లో చిక్కుకున్న 60 మంది విద్యార్థులు
- March 11, 2018
చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా బోడి సమీపంలోని కురంగణి అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపు 60 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక యువతి చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. ఈరోడు, కోయంబత్తూరు నుంచి కళాశాల విజ్ఞాన యాత్ర కోసం విద్యార్థులు అడవుల్లోకి వెళ్లారు.
ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు చెలరేగుతున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నానికి అంతరాయం కలుగుతోంది. సుమారు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులతో సమాచార సంబంధాలు కట్ అవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







