భార్యతో కలిసి పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన పవన్
- March 11, 2018
అమరావతిలో నివాసానికి భూమిపూజ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పంచెకట్టులో వచ్చి హోమంలో పాల్గొన్నారు. అమరావతి సమీపంలోని కాజా గ్రామంలో ఇంటితో పాటు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఆరునెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పూజ కోసం పవన్,సతీ సమేతంగా నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన జనసేనాని.. ఎన్నికలు సమీపించే సమయానికి అమరావతికి తరలివెళ్లాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.
మరోవైపు గుంటూరులో జనసేన ప్లీనరీ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటి భూమిపూజ కోసం గుంటూరు వచ్చిన పవన్.. పార్టీ నేతలతో ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట 14 ఎకరాల స్థలంలో.. మార్చి 14న ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ సభకు 13 జిల్లాల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారని భావిస్తున్నారు. నాలుగు నుంచి ఐదులక్షల మందిని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







