రజినీనైనా విమర్శించటానికి వెనుకాడను: కమల్
- March 13, 2018చెన్నై: రజినీ రాజకీయ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు సక్రమంగా లేకపోతే ఆయనను విమర్శించడానికి మొహమాటపడబోనని 'మక్కల్ నీతి మయ్యం' పార్టీ అధినేత కమల్హాసన్ స్పష్టం చేశారు. అయితే రజినీని రాజకీయంగానే విమర్శిస్తానని, వ్యక్తిగత విమర్శలకు దిగనని కమల్ తేల్చి చెప్పారు. ఓ తమిళ చానల్ ఏర్పాటు చేసిన వేడుకలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి రజినీ రాకను ఆయన ఆహ్వానించారు. ప్రజల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన సిద్ధాంతమని ఇప్పటికే ప్రకటించామని, రజినీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో చూద్దామని కమల్ వ్యాఖ్యానించారు. సిద్ధాంతపరంగా ఏవైనా విభేదాలొస్తే రజినీని విమర్శిస్తానని, అది తమ పార్టీ హుందాతనమని ఆయన తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు సరైనవి కాకపోతే ఏ పార్టీని విమర్శించడానికీ వెనకాడబోనని కమల్హాసన్ స్పష్టం చేశారు. రజినీకాంత్ కూడా రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజలకు సేవ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. నటనలో ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న వీరిద్దరూ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారోనన్న ఉత్కంఠ తమిళ ప్రజల్లో నెలకొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!