న్యూజిలాండ్లో ఎగిరే టాక్సీలు!
- March 15, 2018
న్యూజిలాండ్లో పైలట్ రహిత ఎగిరే టాక్సీలను పరీక్షిస్తున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఈ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారు. ఈ ట్యాక్సీలతో ప్రజా రవాణా రంగంలో విప్లవం వస్తుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. పేజ్ కంపెనీ కిట్లీ హాక్ అనుబంధ సంస్థ అయిన జిఫిర్ ఎయిర్వర్క్స్ ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధిపరిచి, పరీక్షించే ప్రణాళికకు న్యూజిలాండ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. కోరాగా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్కు రెక్కలపై చిన్న లిఫ్ట్ రూటర్లు వుంటాయి. దీంతో, ఈ ఎయిర్క్రాఫ్ట్ నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోగలుగుతుంది. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ అవుతుంది. పట్టణప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులను, కార్ పార్కింగ్ ప్రాంతాలను ల్యాండింగ్ పాడ్లుగా ఉపయోగించుకుంటూ అక్కడ మాత్రమే ప్రయాణికులను రవాణా చేయగలుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఈ టాక్సీల నుండి ఎలాంటి కాలుష్యం వెలువడదని, రవాణా రంగంలో ఇదొక అద్భుతమైన దశ అని జిఫిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెడ్ రెయిడ్ చెప్పారు. కోరా నమూనాను న్యూజీలాండ్లోని దక్షిణ దీవిలో పరీక్షిస్తున్నారు. ఈ వాహనంలో మూడు కంప్యూటర్లు వుండి ప్రయాణ మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఎగిరే టాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







