మస్కట్ నుంచి ఉమ్రా కోసం సలామ్ఎయిర్ కొత్త విమానం
- March 16, 2018
మస్కట్: ఒమన్ తొలి లోకాస్ట్ క్యారియర్ సలామ్ ఎయిర్, మస్కట్ నుంచి టైఫ్కి తొలిసారిగా డైరెక్ట్ ఫ్లయిట్స్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. మే 15 నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసులు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఉమ్రా ప్రార్థనల కోసం వెళ్ళేవారికి ఉపయోగపడనున్నాయి. రిటర్న్ టిక్కెట్స్తో కలిపి 99 ఒమన్ రియాల్స్లోనే విమానాల్ని నడిపేలా సలామ్ ఎయిర్ ఈ విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, హోలీ మాస్క్ ప్రార్థనల కోసం ఈ సర్వీసుల్ని ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన టెర్మినల్ నుంచి విమానాలు బయల్దేరతాయని ఆయన వివరించారు. టైఫ్కి వెళ్ళి, అక్కడి నుంచి తిరిగొచ్చే సర్వీసులకు సంబంధించి టైమింగ్స్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. సలామ్ ఎయిర్కి, సౌదీ అరేబియా కింగ్డమ్ కీలకమైన మార్కెట్గా సలామ్ ఎయిర్కి మారింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









