మస్కట్ నుంచి ఉమ్రా కోసం సలామ్ఎయిర్ కొత్త విమానం
- March 16, 2018మస్కట్: ఒమన్ తొలి లోకాస్ట్ క్యారియర్ సలామ్ ఎయిర్, మస్కట్ నుంచి టైఫ్కి తొలిసారిగా డైరెక్ట్ ఫ్లయిట్స్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. మే 15 నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసులు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఉమ్రా ప్రార్థనల కోసం వెళ్ళేవారికి ఉపయోగపడనున్నాయి. రిటర్న్ టిక్కెట్స్తో కలిపి 99 ఒమన్ రియాల్స్లోనే విమానాల్ని నడిపేలా సలామ్ ఎయిర్ ఈ విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, హోలీ మాస్క్ ప్రార్థనల కోసం ఈ సర్వీసుల్ని ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన టెర్మినల్ నుంచి విమానాలు బయల్దేరతాయని ఆయన వివరించారు. టైఫ్కి వెళ్ళి, అక్కడి నుంచి తిరిగొచ్చే సర్వీసులకు సంబంధించి టైమింగ్స్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. సలామ్ ఎయిర్కి, సౌదీ అరేబియా కింగ్డమ్ కీలకమైన మార్కెట్గా సలామ్ ఎయిర్కి మారింది.
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం