మస్కట్ నుంచి ఉమ్రా కోసం సలామ్ఎయిర్ కొత్త విమానం
- March 16, 2018
మస్కట్: ఒమన్ తొలి లోకాస్ట్ క్యారియర్ సలామ్ ఎయిర్, మస్కట్ నుంచి టైఫ్కి తొలిసారిగా డైరెక్ట్ ఫ్లయిట్స్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. మే 15 నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసులు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఉమ్రా ప్రార్థనల కోసం వెళ్ళేవారికి ఉపయోగపడనున్నాయి. రిటర్న్ టిక్కెట్స్తో కలిపి 99 ఒమన్ రియాల్స్లోనే విమానాల్ని నడిపేలా సలామ్ ఎయిర్ ఈ విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, హోలీ మాస్క్ ప్రార్థనల కోసం ఈ సర్వీసుల్ని ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన టెర్మినల్ నుంచి విమానాలు బయల్దేరతాయని ఆయన వివరించారు. టైఫ్కి వెళ్ళి, అక్కడి నుంచి తిరిగొచ్చే సర్వీసులకు సంబంధించి టైమింగ్స్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. సలామ్ ఎయిర్కి, సౌదీ అరేబియా కింగ్డమ్ కీలకమైన మార్కెట్గా సలామ్ ఎయిర్కి మారింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







