రెండు కొత్త రూట్స్ని ప్రారంభించనున్న మవసలాట్
- March 16, 2018
మస్కట్: నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాట్), వచ్చే మంగళవారం నుంచి రెండు కొత్త రూట్స్ని ప్రారంభించనుంది. మాబెలా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రువి - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య ఈ సర్వీసుల్ని నడుపుతారు. విమాన ప్రయాణీకులకు వీలుగా ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు మవలసాట్ పేర్కొంది. ప్రతి 30 నిమిషాలకీ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా మవసలాట్ బస్సుల్ని కొనుగోలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లు, సరికొత్త బస్సుల్ని ప్రవేశపెడుతున్నట్లు మవసలాట్ పేర్కొంది. మవసలాట్, ఒమన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సంయుక్తంగా ఓ అగ్రిమెంట్ని ట్యాక్సీ సర్వీసుల కోసం కుదుర్చుకున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









