విద్యార్థిని బ్యాగ్ లో నరకబడిన గొర్రె తల..పాఠశాలలో పరుగులు పెట్టిన పిల్లలు
- March 16, 2018
కువైట్:మోటు ఆకతాయి ఎవరో మొత్తం పాఠశాలను పరుగులు పెట్టించాడు. కువైట్ లో ఒక హైస్కూల్ విద్యార్ధిని బ్యాగ్ లో చంపబడిన ఒక గొర్రెల తలను కనుగొనడంతో విద్యార్థులు భయంతో కంగారుపడిపోయారు. అంతే కాకుండా ఓ కాగితం చీటీ అందులో ఈ విధంగా రాయబడి "ఈరోజు గొర్రెపిల్ల తల నీ బ్యాగ్ లో ఉంది. ఆ తల రేపు నీదే అవుతుంది." అని రాయబడి ఉండటంతో దీంతో పాఠశాల తరగతి నుంచి పలువురు విద్యార్థినులు బైటకు పరుగులు తీశారు. ముబారక్ అల్-కబీర్ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని బ్యాగ్ నుండి రక్తంతో తడిచిన గొర్రె తలని తొలగించినప్పుడు పాఠశాలలో పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. వారిలో కొందరు ఆడపిల్లలు మూర్ఛ పోవడం సైతం జరిగిందని సమాచారం. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్ళారు. గొర్రె తలను చెత్త బుట్టలో పెట్టి పాఠశాల కంచె వెలుపల విసిరివేయమని ఆమె ఆదేశించింది. ముబారక్ అల్ కబీర్ జోన్ డైరెక్టర్ ఈ ఘటన గూర్చి మన్సూర్ అల్-డైహని పాఠశాలను సందర్శించి, ఆ గొఱ్ఱెతల విషయమై దర్యాప్తు కోసం న్యాయ వ్యవహారాల శాఖకు పిర్యాదు చేయాలనీ ప్రిన్సిపాల్ కు ఆయన ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం నిఘా కెమెరాల లేకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుని బాధ్యతపై ఆయన ప్రశ్నించారు. గొఱ్ఱెతల బ్యాగ్ లో ఉంచబడిన విద్యార్థిని తండ్రి తన కుమార్తె భయంతో వణికిపోతుందని సంఘటన గురించి పోలీసులకు పిర్యాదు చేశారు. కాని ముబారక్ అల్ కబీర్ ఎడ్యుకేషనల్ జోన్ లో అధికారులు అంతర్గత దర్యాప్తు ఫలితాల కోసం వేచి ఉండాల్సిందిగా నిశ్చయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకు బాధ్యుడైన అపరాధిని శిక్షిస్తామని వారు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి









