20న జరగనున్న ఉగాది మీడియా పురస్కారాలు
- March 17, 2018
హైదరాబాద్: శృతిలయ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆమని తెలిపారు. 20న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవంలో సీనియర్ పాత్రికేయులు ఉడయవర్లు, డా.రౌనఖ్ యార్ఖాన్కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రింట్మీడియా పాత్రికేయులు ఎస్.రామచంద్రాచార్య (నమస్తే తెలంగాణ)తో పాటు ఆర్.రవికాంత్రెడ్డి(హిందూ), బి.వాజేంద్ర(ఈనాడు), ఎస్.సత్యబాబు (సాక్షి) తదితరులను ఎంపిక చేశారు. ఎలక్రానిక్ మీడియా నుంచి వీ6 బుచ్చన్న, టీవీ9 మురళీకృష్ణ తదితరులకు పురస్కారాలు అందజేస్తారన్నారు. స్పీకర్ మధుసూదనాచారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







