చనిపోయి రెండు వారాలైనా స్వదేశానికి చేరని మృతదేహం
- March 18, 2018
మనామా: రెండు వారాల క్రితం ప్రాణాలు కోల్పోయిన ఫుట్బాల్ కోచ్ పార్దీవ దేహం, ఇండియాలోని కేరళ స్టేట్కి చేరుకోకపోవడంతో మృతుడి బంధువుల మానసిక వేదన రోజురోజుకీ పెరిగిపోతోంది. 'రెండు వారాల క్రితం మా ఫాదర్ ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఆయన మృతదేహం స్వదేశానికి వస్తోందో అర్థం కావడంలేదు. స్పాన్సర్తో మాట్లాడానుగానీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కారణంగా కేసు పెండింగ్లో వుంది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాకనే పార్దీవ దేహాన్ని పంపించడానికి వీలవుతుందని చెప్పారు' అంటూ మృతుడు తిలకన్ ఒండాయంకర్యాన్ తనయుడు వైషాక్ తిలకన్ చెప్పారు. 'మేం ఏమీ చేయలేని పరిస్థితుల్లో వున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైషాక్. ఆత్మహత్య కారణంగా ఫుట్ బాల్ కోచ్ చనిపోయినట్లు పోస్ట్మార్టమ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 22న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ టాలెంట్ అకాడమీలో ఫుట్ బాల్ కోచ్గా పనిచేస్తున్న తిలకన్, ఫిబ్రవరి 4 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. జెర్సీలను కొనేందుకు మనామా మార్కెట్కి వెళ్ళిన ఆయన ఆ తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చివరికి ఆయన మరణ వార్త తెలిసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..