మే 9కి ముస్తాబవుతున్న 'మహానటి'
- March 19, 2018
మూడు దశాబ్దాల పాటు దక్షిణాది సినీ ప్రియులను అలరించి, ప్రేక్షకుల గుండెల్లో మహానటిగా ముద్ర వేసుకున్న నటి సావిత్రి. మహానటి పేరుతో సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ఓ సినిమా వస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
దక్షిణాది సినీ అభిమానులను దశాబ్దాల పాటు తన నటనతో మెప్పించిన మహానటి సావిత్రి. ముఖ్యంగా తెలుగు వారి ఆరాధ్య నటిగా సావిత్రిది తరిగిని ఇమేజ్. తరాలు మారిన ఆ మహానటిని ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు. అలాంటి సావిత్రి జీవిత కథతో యువ దర్శకుడు నాగ్ అన్వేష్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మాతగా, మహానటి పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. సావిత్రి బాల్యం నుంచి మరణం వరకు జరిగిన ముఖ్యం సంఘటనలను ఈ మహానటి మూవీలో చూపించబోతున్నారు. తెలుగు, తమిళంలోనే కాక ఇతర ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
మహానటి మూవీలో సావిత్రి పాత్రలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది.. జెమినీ గణేశన్ పాత్రల్లో దుల్కల్ సాల్మన్ చేస్తున్నాడు. ముఖ్యంగా సావిత్ర లుక్ లో కీర్తు సురేష్ అతికినట్టు సరిపోయింది. కాస్ట్యూమ్స్, లుక్ అన్నింటికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే జెమినీ గణేశ్ లుక్ లో దుల్కర్ సాల్మన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక ఈ మూవీలో అనుష్క భానుమతిగా, మోహన్ బాబు ఎస్.వి.ఆర్ గా, నాగచైతన్య ఎఎన్ఆర్ గా, సమంత జమునగా కనిపించబోతున్నారు. మార్చిలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







