ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం: కేటీఆర్
- March 19, 2018
హైదరాబాద్ : నాగోల్, హైటెక్సిటీ, ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోను విస్తరిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జేబీఎస్, ఎంజీబీఎస్ వద్ద మెట్రో పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొన్ని చోట్ల రోడ్ల వెడల్పు 200 అడుగుల మేర విస్తరిస్తున్నామని తెలిపారు. సుల్తాన్ బజార్ ఏరియాలో 66 అగుడుల వరకు విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. పాత బస్తీలో ప్రాజెక్టు పనులను వందకు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. జేబీఎస్ నుంచి ఫలక్నూమా వరకు మెట్రో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు మొత్తం కాస్ట్ రూ.14 వేల 133 కోట్లు, కాగా ఇప్పటి వరకు రూ. 2,296 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!