ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం: కేటీఆర్
- March 19, 2018
హైదరాబాద్ : నాగోల్, హైటెక్సిటీ, ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోను విస్తరిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జేబీఎస్, ఎంజీబీఎస్ వద్ద మెట్రో పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొన్ని చోట్ల రోడ్ల వెడల్పు 200 అడుగుల మేర విస్తరిస్తున్నామని తెలిపారు. సుల్తాన్ బజార్ ఏరియాలో 66 అగుడుల వరకు విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. పాత బస్తీలో ప్రాజెక్టు పనులను వందకు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. జేబీఎస్ నుంచి ఫలక్నూమా వరకు మెట్రో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు మొత్తం కాస్ట్ రూ.14 వేల 133 కోట్లు, కాగా ఇప్పటి వరకు రూ. 2,296 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







