భారత్కు రాలేను - గీతాంజలి జెమ్స్ అధినేత
- March 19, 2018
న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్లో సీబీఐ తాజాగా జారీ చేసిన సమన్లపై పరారీలో ఉన్న నిందితుడు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీ బదులిచ్చాడు. తన పాస్పోర్ట్ రద్దు కావడం, తాను అస్వస్థతతో బాధపడుతుండటంతో భారత్కు వచ్చి విచారణలో పాల్గొనలేనని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీబీఐ నోటీసులకు చోక్సీ ఈమెయిల్లో బదులిస్తూ..తన పాస్పోర్ట్ రద్దుపై ఇప్పటి వరకూ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం ఎలాంటి సమాచారం పంపలేదని చెప్పుకొచ్చారు.
విదేశాల్లో వ్యాపార లావాదేవీల్లో తాను పూర్తిగా నిమగ్నమయ్యానని..భారత్లో తమపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వ్యాపారం మూసివేత దృష్ట్యా ఎదురైన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున భారత్కు రాలేకపోతున్నానని లేఖలో దర్యాప్తు ఏజెన్సీకి స్పష్టం చేశారు. రూ 12,000 కోట్ల పీఎన్బీ స్కామ్లో తక్షణమే విచారణకు హాజరుకావాలని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు ఈ నెల తొలివారంలో సీబీఐ తాజాగా సమన్లు పంపిన విషయం తెలిసిందే. నకిలీ పత్రాలతో వీరిరువురూ పీఎన్బీ నుంచి రూ 12,000 కోట్లు పైగా రుణాలు పొంది, కుంభకోణం బయటపడే సమయంలో దేశం విడిచివెళ్లారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!