అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చిన్నమ్మకు పెరోల్ మంజూరు
- March 20, 2018చెన్నై : తీవ్ర అనారోగ్యంతో మరణించిన తన భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 15 రోజుల పెరోల్ కోసం ఏఐఏడీఎంకే బహిష్కృత చీఫ్ వీకే శశికళ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. నటరాజన్ ఈరోజు తెల్లవారుజూమున ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న నటరాజన్ను గతవారం గ్లెన్ఈగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రికి తరలించారు. నటరాజన్కు 2017లో లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.
కాగా ప్రస్తుతం బెంగళూర్లోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నేరుగా తంజావూర్ వెళ్లనున్నట్టు తెలిసింది. బ్రిటన్ నుంచి దిగుమతి సుంకం చెల్లించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశారనే కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో నటరాజన్ సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు.
తాజా వార్తలు
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం