ట్రక్కుని ఢీ కొన్న బస్సు ఘటనలో ఇద్దరు మృతి, 26 మందికి గాయాలు
- March 21, 2018
మక్కా : 50 మంది ప్రయాణీకులతో వెళుతున్నబస్సు ఒక ట్రక్కుని ' ఢీ ' కొట్టిన ఘటనలో మక్కాలోని జామౌమ్ సమీపంలోని అల్-క్వైయ్యా రహదారిపై కరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ సహాయకుడి తో సహా చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినపుడు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు, వీరినందరిని మక్కాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. బస్సు లోపల ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం పొందిన తర్వాత సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకొన్నారు. ఇనుమును కత్తిరించే సాధనాలను ఉపయోగించి పలువురిని వెలుపలకు తీసి రక్షించారు. వీరికి ప్రథమ చికిత్స అందించినట్లు ఆరోగ్య వ్యవహారాలు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీల బృందాల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









