ట్రక్కుని ఢీ కొన్న బస్సు ఘటనలో ఇద్దరు మృతి, 26 మందికి గాయాలు
- March 21, 2018మక్కా : 50 మంది ప్రయాణీకులతో వెళుతున్నబస్సు ఒక ట్రక్కుని ' ఢీ ' కొట్టిన ఘటనలో మక్కాలోని జామౌమ్ సమీపంలోని అల్-క్వైయ్యా రహదారిపై కరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ సహాయకుడి తో సహా చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినపుడు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు, వీరినందరిని మక్కాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. బస్సు లోపల ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం పొందిన తర్వాత సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకొన్నారు. ఇనుమును కత్తిరించే సాధనాలను ఉపయోగించి పలువురిని వెలుపలకు తీసి రక్షించారు. వీరికి ప్రథమ చికిత్స అందించినట్లు ఆరోగ్య వ్యవహారాలు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీల బృందాల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన