మలేషియాలో 'నిన్నే చూస్తు'
- March 21, 2018
నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత ప్రధాన తారాగణంలో రూపొందుతున్న చిత్రం నిన్నే చూస్తు. సుమన్, భానుచందర్, సుహాసిని ఇతర ముఖ్యపాత్రధారులు. కె.గోవర్థనరావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. హేమలతా రెడ్డి నిర్మాత. ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. తాజాగా మూడవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల నిన్నే చూస్తు అనే పాటను మలేషియాలో చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ మా సినిమాకు టైటిల్ సాంగ్ ప్రత్యేకం. సంగీత దర్శకుడు రమణ్ రాథోడ్ మంచి బాణీలు అందించారు. మంచి కుటుంబకథతో తీస్తున్న సినిమా ఇది. సీనియర్ నటులు నటించడం ఆనందంగా ఉంది. త్వరలో షూటింగ్ పూర్తిచేస్తాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం రమణ్ రాథోడ్, ఛాయాగ్రహణం ప్రసాద్ ఈదర, మాటలు కరణ్ గోపిని, స్క్రీన్ప్లే, దర్శకత్వం కె.గోవర్థన్ రావు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







