మలేషియాలో 'నిన్నే చూస్తు'
- March 21, 2018
నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత ప్రధాన తారాగణంలో రూపొందుతున్న చిత్రం నిన్నే చూస్తు. సుమన్, భానుచందర్, సుహాసిని ఇతర ముఖ్యపాత్రధారులు. కె.గోవర్థనరావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. హేమలతా రెడ్డి నిర్మాత. ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. తాజాగా మూడవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల నిన్నే చూస్తు అనే పాటను మలేషియాలో చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ మా సినిమాకు టైటిల్ సాంగ్ ప్రత్యేకం. సంగీత దర్శకుడు రమణ్ రాథోడ్ మంచి బాణీలు అందించారు. మంచి కుటుంబకథతో తీస్తున్న సినిమా ఇది. సీనియర్ నటులు నటించడం ఆనందంగా ఉంది. త్వరలో షూటింగ్ పూర్తిచేస్తాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం రమణ్ రాథోడ్, ఛాయాగ్రహణం ప్రసాద్ ఈదర, మాటలు కరణ్ గోపిని, స్క్రీన్ప్లే, దర్శకత్వం కె.గోవర్థన్ రావు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









