రస్ అల్ ఖైమాలో విధించిన జరిమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 21, 2018
రస్ అల్ ఖైమా : విధించిన జరిమానాలపై మార్చి 20 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యే విధంగా 30 శాతం డిస్కౌంట్ ను రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ మూడు రోజుల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సదుపాయం వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఉద్దేశించబడింది. డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ అహ్మద్ మొహమ్మద్ అహ్మద్ అల్ హమ్మాడి తెలిపిన వివరాల ప్రకారం."పర్యావరణ వ్యతిరేక ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు తెలియచేస్తూ , పర్యావరణానికి సంబంధించి ఏ ఉల్లంఘనను నివేదించామని, ఉద్యోగులందరూ తమ తమ సంతోషాన్ని పంచుకునేందుకు వారికి వివిధ బహుమతులు పంపిణీ చేశారు. "స్ఫూర్తిదాయకమైన పని వాతావరణానికి ప్రధాన లక్షణాలలో సంతోషం అనేది ఒకటి. "సంతోషంగా ఉన్న ఉద్యోగి బంధనాల నుండి వెలుపలకు వచ్చి ఆలోచించగలడు అలాగే ,వినియోగదారులకు ఆనందం కలిగించగలడు." అదేవిధంగా రాస్ అల్ ఖైమా లో ప్రతి ఇంటికి మొక్కను సమర్పించటానికి ఒక నూతన కార్యక్రమం ప్రారంభించబడింది. " వరల్డ్ హ్యాపీనెస్ డే మరియు జాయేద్ ఇయర్, ఎమిరేట్ లో పచ్చని ప్రాంతాలు వ్యాపించడానికి ఎంతో సహాయం పడుతుంది. ప్రజలకు సంతోషం పంచడమే కాక వారిని పర్యావరణ రక్షణలో భాగస్వామిగా ఉండేందుకు తాము ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









