రస్ అల్ ఖైమాలో విధించిన జరిమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 21, 2018
రస్ అల్ ఖైమా : విధించిన జరిమానాలపై మార్చి 20 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యే విధంగా 30 శాతం డిస్కౌంట్ ను రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ మూడు రోజుల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సదుపాయం వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఉద్దేశించబడింది. డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ అహ్మద్ మొహమ్మద్ అహ్మద్ అల్ హమ్మాడి తెలిపిన వివరాల ప్రకారం."పర్యావరణ వ్యతిరేక ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు తెలియచేస్తూ , పర్యావరణానికి సంబంధించి ఏ ఉల్లంఘనను నివేదించామని, ఉద్యోగులందరూ తమ తమ సంతోషాన్ని పంచుకునేందుకు వారికి వివిధ బహుమతులు పంపిణీ చేశారు. "స్ఫూర్తిదాయకమైన పని వాతావరణానికి ప్రధాన లక్షణాలలో సంతోషం అనేది ఒకటి. "సంతోషంగా ఉన్న ఉద్యోగి బంధనాల నుండి వెలుపలకు వచ్చి ఆలోచించగలడు అలాగే ,వినియోగదారులకు ఆనందం కలిగించగలడు." అదేవిధంగా రాస్ అల్ ఖైమా లో ప్రతి ఇంటికి మొక్కను సమర్పించటానికి ఒక నూతన కార్యక్రమం ప్రారంభించబడింది. " వరల్డ్ హ్యాపీనెస్ డే మరియు జాయేద్ ఇయర్, ఎమిరేట్ లో పచ్చని ప్రాంతాలు వ్యాపించడానికి ఎంతో సహాయం పడుతుంది. ప్రజలకు సంతోషం పంచడమే కాక వారిని పర్యావరణ రక్షణలో భాగస్వామిగా ఉండేందుకు తాము ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







